మారిన ఎంబీబీఎస్ ​ఎగ్జామ్స్​షెడ్యూల్​

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-09-08 16:25:41  IST  )

కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో ఈ శుక్రవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ కంట్రోలర్

మారిన ఎంబీబీఎస్ ​ఎగ్జామ్స్​షెడ్యూల్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో ఈ శుక్రవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎక్సమినేషన్స్ వెల్లడించారు. గణేశా నిమజ్జనం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేశారు. ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం, బీడీఎస్ చివరి సంవత్సరం, పోస్ట్ బేసిక్ నర్సింగ్ మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా పడిన ఎంబీబీఎస్ మైక్రో బయాలజీ పరీక్షా ఈ నెల 19న, బీడీఎస్ పెరియోడొంటోలోజీ 21న, పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఇంగ్లిష్ పరీక్ష ౩౦వ తేదీన నిర్వహించనున్నారు. అయితే ఈ నెల 12 నుంచి జరగాల్సిన పరీక్షలన్నీ యథావిధంగా జరుగుతాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read: NEET-UG 2022 ఫలితాలు విడుదల..

Next Story